hari krishna: మొయినాబాద్ ఫామ్ హౌస్ లో హరికృష్ణ అంత్యక్రియలు

  • శోకసంద్రంలో మునిగిపోయిన నందమూరి కుటుంబం
  • పోస్టుమార్టం తర్వాత హైదరాబాదులోని నివాసానికి మృతదేహం తరలింపు
  • మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో నివాళి

ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన మరణంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు, మొయినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత హైదరాబాదులోని నివాసానికి ఆయన మృత దేహాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో హరికృష్ణకు నివాళి అర్పించనున్నారు. 

More Telugu News