jayasudha: మహేశ్ తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్

  • మహేశ్ 25వ మూవీగా 'మహర్షి'
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • వచ్చే వేసవిలో విడుదల  

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మహేశ్ బాబు తల్లిదండ్రులుగా జయసుధ .. ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. గతంలో వచ్చిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలోను జయసుధ .. ప్రకాశ్ రాజ్ మహేశ్ బాబు తల్లిదండ్రులుగా నటించారు. 'మహర్షి' సినిమాలోను ఇదే కాంబినేషన్ తెరపై సందడి చేయనుంది. జయసుధకి సంబంధించిన పోర్షన్ ను ఆల్రెడీ షూట్ చేసేశారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, వంశీ పైడిపల్లి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

More Telugu News