Kurnool District: కోడలిని చంపేసి ఆత్మహత్య చేసుకున్న మామ.. కర్నూలులో కలకలం

  • క్షణికావేశానికి ఇద్దరు బలి
  • కోడలిని రోకలిబండతో మోది చంపిన మామ
  • భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య

క్షణికావేశం ఇద్దరిని బలితీసుకుంది. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన కుటుంబ తగాదాల్లో ఆవేశం కారణంగా రెండు నిండు ప్రాణాలు పోయాయి. కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో మామా కోడలు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఆవేశం ఆపుకోలేని మామ రోకలిబండతో కోడలిని కొట్టి చంపాడు. ఆమె చనిపోవడంతో భయపడిన మామ, ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వివరాలు అందాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

More Telugu News