samantha: పింకీరెడ్డి ఇచ్చిన విందు బాగుందన్న టాలీవుడ్ హీరోయిన్లు!

  • ఈ విందులో పాల్గొన్న సమంత, తమన్నా, అదితి
  • అక్కినేని అమల కూడా హాజరు
  • విందు అద్భుతంగా ఉందన్న హీరోయిన్లు

ఓ పార్టీలో టాలీవుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, అదితిరావు హైదరి సందడి చేశారు. ఈ పార్టీలో అక్కినేని అమల కూడా పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించి ఫొటోలను సమంత, తమన్నాలు తమ ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేశారు. నిన్న రాత్రి జరిగిన పార్టీ చాలా సరదాగా జరిగిందని తమ ట్వీట్లలో తెలిపారు.

చక్కటి విందు ఏర్పాటు చేసిన పింకీ రెడ్డి (పారిశ్రామికవేత్త టి.సుబ్బరామిరెడ్డి తనయ)కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ‘రా మ్యాంగో’ పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తన ట్వీట్ లో తమన్నా తెలిపింది. అంతేకాకుండా, చాలా రోజుల తర్వాత అమల మేడమ్, సమంత, అదితి లను కలవడం తనకు సంతోషంగా ఉందని తమన్నా పేర్కొంది. ఈ పార్టీ ఏర్పాటు చేసిన సంజయ్ గర్గ్, పింకీ రెడ్డికి అదితి హైదర్ ధన్యవాదాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారు పోస్ట్ చేశారు. 

More Telugu News