vijay devarakonda: 50 కోట్లకి పైగా లాభాలు తెచ్చిపెట్టిన 'గీత గోవిందం'

  • 10 కోట్లతో తెరకెక్కిన 'గీత గోవిందం'
  • ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు 
  • రెండు వారాల్లో 100 కోట్లకి పైగా గ్రాస్

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై .. పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం' చిత్రం తెరకెక్కింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచి ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు చూపిస్తూ వస్తోంది. తొలి 5 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, రెండు వారాల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంకా ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది.

ఈ సినిమాను అల్లు అరవింద్ 10 కోట్లతో నిర్మించారు. అలాంటి ఈ సినిమా ఇంతవరకూ ఆయనకి 50 కోట్లకి పైగా లాభాలను తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి లాభాలను అందుకున్న నిర్మాత అల్లు అరవిందేనని అంటున్నారు. గతంలో అల్లు అరవింద్ హిందీలో నిర్మించిన 'గజిని' సినిమా తరువాత, ఆ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఇదేనని చెబుతున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ మామూలు హిట్ కొట్టలేదు అని చెప్పేసుకుంటున్నారు.         

More Telugu News