jayasudha: 'హ్యాండ్సప్' సినిమాతో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది!: జయసుధ

  • పెళ్లైన తరువాత నిర్మాతగా మారాను 
  • మొదటి రెండు సినిమాలు బాగానే ఆడాయి  
  • తర్వాత నుంచి నష్టాలే 

తెలుగు ప్రేక్షకుల చేత సహజనటి అనిపించుకున్న జయసుధ, ఆ తరువాత కాలంలో నిర్మాతగాను కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ విషయాలను గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో జయసుధ ప్రస్తావించారు. నితిన్ కపూర్ తో నాకు పెళ్లి అయిన తరువాత నిర్మాతగా మారడం జరిగింది. దాసరి గారి దర్శకత్వంలో 'ఆత్మ బంధువులు' .. 'కాంచనసీత' నిర్మించాము .. ఈ రెండు సినిమాల వలన మా డబ్బులు మాకు వచ్చేశాయి.

తెలుగులో వచ్చిన 'నా మొగుడు నాకే సొంతం' సినిమాను హిందీలో నిర్మించాము .. అది కొంతవరకూ దెబ్బకొట్టింది. ఈ సినిమా తరువాత తెలుగులో చేసిన 'వింత కోడళ్లు' .. 'అదృష్టం' భారీ నష్టాలనే తెచ్చిపెట్టాయి. ఆ తరువాత చేసిన 'హ్యాండ్సప్' సినిమాతో చాలావరకూ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News