Pawan Kalyan: పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలు మార్ఫింగ్.. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు

  • అసభ్యకర రీతిలో పవన్ తల్లి ఫొటోలు అప్ లోడ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రావణ్ అనే వ్యక్తి
  • ఐపీ అడ్రస్ కనుగొనే ప్రయత్నంలో పోలీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరరీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... 'చంటిఅబ్బాయ్' అనే ట్విటర్ అకౌంట్ నుంచి ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను చూసిన శ్రావణ్ అనే వ్యక్తి ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కేసును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు... ఫొటోలు అప్ లోడ్ అయిన ఐపీ అడ్రస్ ను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.

మరోవైపు, ఈ అంశంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ తల్లిని వివాదాల్లోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News