Chandrababu: 5 వేల కోట్ల రుణం మంజూరుకు చంద్రబాబుకు హామీ ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ ఈడీ

  • చంద్రబాబుతో భేటీ అయిన ఇండియన్ బ్యాంక్ ఈడీ
  • రుణం మంజూరుకు సత్వరమే చర్యలు తీసుకుంటామంటూ హామీ
  • ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందంటూ కితాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంకే భట్టాచార్య ఈరోజు కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఎంవోయూ మేరకు రూ. 5 వేల కోట్ల రుణం మంజూరుకు సత్వరమే చర్యలు తీసుకుంటామని చంద్రబాబుకు భట్టాచార్య హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో కేరళ వరద బాధితుల సహాయార్థం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఒక్కరోజు వేతన విరాళం రూ. 14,83,336 చెక్కును భట్టాచార్యకు చంద్రబాబు అందించారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎంకు పంపాలని కోరారు. భేటీ అనంతరం మీడియాతో భట్టాచార్య మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

More Telugu News