tammineni: తెలంగాణ’లో ‘జనసేన’తో కలిసి పనిచేయాలని ఉందన్న సీపీఎం నేత తమ్మినేని

  • పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాసిన తమ్మినేని
  • ఏపీలో మాదిరి తెలంగాణలోనూ కలిసి పని చేద్దాం 
  • ఈ లేఖపై రాజకీయ వర్గాల్లో చర్చ

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కలసి పని చేయాలని ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాశారు. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ కలిసి పనిచేద్దామని ఆ లేఖలో కోరారు.

కాగా, ఇంతకుముందు, పవన్ కల్యాణ్ ని తమ్మినేని వీరభద్రం కలిశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఏపీలో తన పోరాట యాత్రలో బిజీబిజీ అయిపోయారు. ప్రస్తుతం ‘తెలంగాణ’లో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కు తమ్మినేని లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

More Telugu News