nagachaithanaya: 'శైలజా రెడ్డి అల్లుడు' నుంచి మనసును తాకే మెలోడీ

  • మారుతి నుంచి 'శైలజా రెడ్డి అల్లుడు'
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్ 
  • వచ్చేనెల 13వ తేదీన విడుదల   

నాగచైతన్య కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం రూపొందింది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన, ఈ సినిమా విడుదల వచ్చేనెల 13వ తేదీకి వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు.

"ఏ ఊరు .. ఏ దారి .. ఏ దూరమైనా .. నే రానా చేసేసి ఏ నేరమైనా .. గదులు ఆపేనా .. నదులు ఆపేనా .. నేను దాటేయనా .. చాటేయనా .. ప్రేమనీ .. " అంటూ ఈ మెలోడీ సాంగ్ సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యానికి గోపీసుందర్ బాణీని సమకూర్చగా, సిద్ శ్రీరామ్ .. లిప్సిక ఆలపించారు. నాయకా నాయికలపై చిత్రీకరించిన ఈ పాట మధురంగా మనసును తాకుతూ, యూత్ ను కట్టిపడేసేలా వుంది. కొత్తగా .. మత్తుగా వినిపిస్తూ మంచి మార్కులు కొట్టేసేలా అనిపిస్తోంది.

More Telugu News