jagapathibabu: ఆ సమయంలో ఇక సీరియల్స్ లో చేద్దామనుకున్నాను: జగపతిబాబు

  • ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమనుకున్నాను
  • ఇల్లు అమ్మేసినా 3 కోట్ల మైనస్ లో వున్నాను 
  • ఆ సమయంలోనే అద్భుతం జరిగింది    

తెలుగు తెరపై ఇద్దరు కథానాయికలతో జోడీకడుతూ మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్కువగా దోచుకున్న కథానాయకులలో శోభన్ బాబు తరువాత జగపతిబాబు కనిపిస్తారు. ఆ తరువాత హీరోగా విజయాలకు దూరమైన ఆయన, విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి శభాష్ అనిపించుకున్నారు. అందుకు సంబంధించిన విషయాలను తాజాగా ఆయన 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పంచుకున్నారు.

"2012లో సినిమా నటుడిగా నా కెరియర్ పూర్తయిందనే అనుకున్నాను. ఇక ఇండస్ట్రీలో కొనసాగడం అసాధ్యమని భావించాను. ఉన్న అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మేసినా 3 కోట్ల మైనస్ లో వున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు .. కుటుంబాన్ని పోషించడం కోసం సీరియల్స్ లో చేద్దామని అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఏదైనా అద్భుతం జరిగి ఆ కష్టాల నుంచి గట్టెక్కాలని అనుకుంటారు .. అలాంటి అద్భుతమే నా జీవితంలో జరిగింది. మొదటి నుంచి కూడా నేను టైమ్ ను నమ్ముతాను .. ఆ టైమ్ వచ్చింది .. అదే ఈ రోజున నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News