modi: కేసీఆర్ కప్పిన ఆ శాలువాతో అలానే కూర్చున్న మోదీ!

  • నిన్న మోదీ-కేసీఆర్ భేటీలో ఆసక్తికర అంశం
  • ఆకుపచ్చ రంగు శాలువాతో సన్మానించిన కేసీఆర్
  • భేటీ ముగిసే వరకూ ఆ శాలువాతోనే ఉన్న మోదీ

ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీని ఈరోజు కలిశారు. నిన్న ప్రధాన మంత్రి మోదీని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీకి ఆకుపచ్చ రంగు శాలువా కప్పి కేసీఆర్ సన్మానించారు. అనంతరం, సుమారు ఇరవై నిమిషాలకు పైగా వారి భేటీ కొనసాగింది. ఈ భేటీ కొనసాగినంత సేపూ కేసీఆర్ కప్పిన శాలువాతోనే మోదీ ఉండటం గమనార్హం. ఎందుకంటే, ఎవరైనా మోదీని కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం ఇచ్చినా, శాలువాతో సన్మానించినా.. వెంటనే వాటిని తన సిబ్బందికి ఆయన అందజేస్తుంటారు. కానీ, కేసీఆర్ తనకు కప్పిన శాలువాను మోదీ అలానే ఉంచుకోవడం ఆసక్తిదాయకం, విశేషం!

More Telugu News