modi: ప్రధాని మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు.. చిత్రమాలిక

  • మోదీ నివాసంలో చిన్నారుల సందడి
  • చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని
  • వారితో సరదాగా కాసేపు ముచ్చటించిన వైనం

ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి చిన్నారులు రాఖీలు కట్టారు. ఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్ లో ఉన్న మోదీ నివాసానికి పలువురు చిన్నారులు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ చేతికి రాఖీలు కట్టారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News