Nagarjuna: క్యాన్సర్ తో మృతి చెందిన నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్... మూలస్తంభాన్ని కోల్పోయానని నాగ్ భావోద్వేగం!

  • కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రవీందర్ రెడ్డి
  • ఆయన మృతి వార్త విని నాగార్జున దిగ్భ్రాంతి
  • ట్విట్టర్ ఖాతాలో నాగ్ నివాళులు

గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.రవీందర్ రెడ్డి మృతి చెందారు. తన వీరాభిమాని, స్నేహితుడు అయిన రవీందర్ మృతిపై నాగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన కుటుంబానికి మూలస్తంభంలా నిలిచిన రవీందర్ తనకెంతో మంచి స్నేహితుడని, అతన్నిక ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అందరికీ సాయం చేసే గుణం ఆయనదని అన్నారు.

కాగా, రవీందర్ కు క్యాన్సర్ సోకిందని తెలుసుకున్న తరువాత, చికిత్స నిమిత్తం నాగార్జున ధన సహాయం కూడా చేశారు. అయినా అతని ప్రాణాలు మిగల్లేదు. నాగ్ కెరీర్ లో క్లాసికల్ మూవీగా నిలిచిపోయిన 'గీతాంజలి' క్లయిమాక్స్ ను రవీందర్ సూచన మేరకే మార్చడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చివర్లో చంపేయాలని దర్శకుడు మణిరత్నం నిర్ణయించగా, అలా చేస్తే, అభిమానులు తట్టుకోలేరని రవీందర్ చెప్పడంతో, మణిరత్నం క్లయిమాక్స్ ను మార్చారట.

More Telugu News