Anjali: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాజశేఖర్ నాయికగా అంజలి 
  • రేపు రవితేజ ఫస్ట్ లుక్ విడుదల 
  • అగ్ర నిర్మాత చేతిలో 'పేపర్ బాయ్'
  • రోజుకి సునీల్ పారితోషికం ఎంతంటే..!  

*  ప్రముఖ నటి అంజలి డాక్టర్ రాజశేఖర్ సరసన నటించనుంది. 'గరుడవేగ' సినిమా తర్వాత రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో ఆయన సరసన కథానాయికగా అంజలిని తీసుకున్నారు.
*  శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రేపు (సోమవారం) దర్శకుడు విడుదల చేయనున్నాడు.
*  దర్శకుడు సంపత్ నంది నిర్మించిన 'పేపర్ బాయ్' చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. చిత్రం పట్ల వున్న నమ్మకంతో ఆయన ఈ హక్కులను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
*  హాస్య నటుడు సునీల్ ప్రస్తుతం పలు సినిమాల్లో కామెడీ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయన భారీ స్థాయిలో రోజుకి మూడున్నర లక్షలు పారితోషికంగా తీసుకుంటున్నాడట. 

More Telugu News