vijayasai reddy: మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరతారన్న విజయసాయిరెడ్డి.. ఖండించిన మాజీ డీజీపీ!

  • వైసీపీలోకి ఆయన రానుండటం శుభపరిణామం
  • సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటాం
  • మీడియాతో విజయసాయిరెడ్డి

వైసీపీ అధినేత జగన్ ని ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. వైసీపీలోకి సాంబశివరావు వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. సాంబశివరావు త్వరలోనే తమ పార్టీలో చేరనున్నారని, ఇది శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.

విజయసాయిరెడ్డి ప్రకటనను ఖండిస్తున్నా: సాంబశివరావు

అయితే, విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను సాంబశివరావు ఖండించారు. జగన్ ని తాను కలవడంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, గంగవరం పోర్టు సీఈఓ హోదాలో మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలిశానని అన్నారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన్ని తాను కలిసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని సాంబశివరావు స్పష్టం చేశారు.

More Telugu News