kcr: కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని మోదీని కోరిన కేసీఆర్!

  • మోదీ నివాసంలో 20 నిమిషాలకు పైగా భేటీ  
  • తెలంగాణకు రావాల్సిన నిధుల మంజూరుపై ప్రస్తావన
  • పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరిన కేసీఆర్

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. మోదీ నివాసంలో ఇరవై నిమిషాలకు పైగా ఈ భేటీ కొనసాగింది. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని మోదీని కేసీఆర్ కోరినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ బిల్లు, రక్షణశాఖ భూముల బదలాయింపు అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేసీఆర్ కోరారని సమాచారం.  
  

More Telugu News