paruchuri: ఆ సీన్ విన్న చిరంజీవిగారు ఖరీదైన మొబైల్ ను నాకు బహుమతిగా ఇచ్చారు :పరుచూరి గోపాలకృష్ణ

  • మేకప్ రూమ్ లో కూర్చుని ఆ సీన్ రాశాను 
  • సెట్లోనే చిరంజీవికి వినిపించాను 
  • ఆయనకి విపరీతంగా నచ్చేసింది

'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'ఇంద్ర' సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. 'ఇంద్ర' సినిమాలో ఒక బలమైన సీన్ పడాలనే అభిప్రాయాన్ని చిరంజీవిగారు వ్యక్తం చేయడంతో, అప్పటికప్పుడు ఒక సీన్ ను క్రియేట్ చేశాము .. మేకప్ రూమ్ లో కూర్చుని డైలాగ్స్ రాసి సెట్లో చిరంజీవికి వినిపించాను.

ఆ సీన్ లోని డైలాగే 'రాననుకున్నారా .. రాలేననుకున్నారా?'. ఆ సీన్ .. అందులోని డైలాగ్స్ విని చిరంజీవిగారు వెంటనే అశ్వనీదత్ గారిని పిలిచి, తన చేతిలోని ఖరీదైన మొబైల్ ను ఆయనకి చూపిస్తూ .. 'ఇలాంటి మొబైల్ గంటలో గోపాలకృష్ణగారి చేతిలో ఉండాలి .. అది ఆయనకి మనం ఇస్తోన్న బహుమతి' అన్నారు. వెంటనే అశ్వనీదత్ గారు మొబైల్ తెప్పించి నా చేతిలో పెట్టారు. అది నాకు ఒక అద్భుతమైన జ్ఞాపకం" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News