ఒప్పో: ఆకట్టుకునే ఫీచర్లతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసిన ఒప్పో!

  • చైనాలో విడుదలైన 'ఒప్పో ఆర్17'
  • రెండు వేరియంట్ లలో లభ్యం
  • త్వరలో భారత మార్కెట్లోకి

మొబైల్ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్17 ను తాజాగా చైనాలో విడుదల చేసింది. 6/8 జీబీ ర్యామ్ అనే రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకి లభించనుంది. 6జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.32620 ఉండగా, 8జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.35600గా ఉంది. ఇప్పటికే ఆన్ లైన్ లో ప్రీ ఆర్డర్లు మొదలవగా, ఈ నెల 30 నుండి కస్టమర్లకి అందుబాటులోకి రానుంది. పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ నియాన్ పర్పుల్, స్ట్రీమ్ బ్లూ రంగులలో లభించనుంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

ఒప్పో ఆర్17 ప్రత్యేకతలు:

  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్
  • 6.4" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
  • వెనక భాగంలో 16/ 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు
  • ముందు భాగంలో 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 3500ఎంఏహెచ్ బ్యాటరీ(ఫ్లాష్ ఛార్జ్)

More Telugu News