Kerala: యూఏఈ 700 కోట్ల సాయం చేస్తానని చెప్పిందా?: కేరళ బీజేపీ చీఫ్

  • యూఏఈ అధికారికంగా ప్రకటించలేదు 
  • ఎమిరేట్స్ సాయం చేస్తుందని సీఎంకు చెప్పిందెవరు?
  • కేరళ సీఎం ప్రకటనపై ఫైర్ అయిన బీజేపీ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ శ్రీధరన్ మండిపడ్డారు. కేరళను ఆదుకోవటానికి యూఏఈ సుమారు రూ.700 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ప్రకటనపై బీజేపీ చీఫ్ స్పందించారు. కేరళకు సాయంగా రూ.700 కోట్లు ఇస్తామని యూఏఈ ప్రకటించలేదని, మరి ఈ విషయంలో ఆ దేశం తరఫున ముఖ్యమంత్రికి ఎవరు హామీ ఇచ్చారో చెప్పాలని శ్రీధరన్ డిమాండ్ చేశారు.  

More Telugu News