paruchuri: 'సైరా' క్లైమాక్స్ డైలాగ్ చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ

  • చిరంజీవి గారంటే ఎంతో ప్రేమ 
  • మీరంటే ఎంతో అభిమానం 
  • అందుకే ఒక డైలాగ్ లీక్ చేశాను  

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాను గురించి 'పరుచూరి పలుకులు'లో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ రోజున సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాను .. మీరందరూ ఆ డైలాగ్ ను ఇష్టపడ్డారు. ఈ సినిమా నుంచి నేను మరొక డైలాగ్ చెప్పాలని అనుకుంటున్నాను.

'సైరా' నరసింహా రెడ్డి' క్లైమాక్స్ లో కథానాయకుడి చేతులిరిచి కట్టేశారు .. ముఖం ముందు ఉరితాడు వేళ్లాడుతోంది .. "ఏంట్రా ఆ ధైర్యం .. సావు భయం లేదా నీకు?" అంటూ ఓ పాత్ర అంటే, 'సచ్చి పుట్టినవాడిని .. సనిపోయిన తరువాత కూడా బతికేవాణ్ణి .. సావంటే నాకెందుకురా భయం' అనేది కథానాయకుడి డైలాగ్. ఆగలేక మీ కోసమని ఈ చిన్న డైలాగ్ ను లీక్ చేశాను .. చిరంజీవిగారు కోప్పడతారేమో నిజంగా నాకు తెలియదు. ఆయన మీదున్న ప్రేమతో .. మీపై గల అభిమానంతోనే ఈ డైలాగ్ ను లీక్ చేశాను' అంటూ చెప్పుకొచ్చారు.      

More Telugu News