sensex: స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న స్టాక్ మార్కెట్లు

  • ఒత్తిడికి గురైన దేశీయ మార్కెట్లు
  • 51 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 11.85 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కొంచెం ఒత్తిడికి గురయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్ల లాభంతో 38,337కి పెరిగింది. నిఫ్టీ 11.85 పాయింట్ల లాభంతో 11,566కు చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ (17.04%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (6.16%), టీటీకే ప్రిస్టేజ్ (5.94%), నెస్లే ఇండియా (5.94%), కజారియా సిరామిక్స్ (5.92%).

టాప్ లూజర్స్:
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (-6.62%), గ్రాఫైట్ ఇండియా (-4.89%), టాటా మోటార్స్ (-4.33%), పీసీ జువెలర్స్ (-4.27%), ఎంసీఎక్స్ (-3.90%).       

More Telugu News