tmc: తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో పేలుడు.. ఒకరి మృతి

  • పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని పార్టీ ఆఫీసులో పేలుడు
  • గ్యాస్ సిలిండర్ పేలుడు కానీ, క్రూడ్ బాంబ్ కానీ కారణం కావచ్చని అనుమానం
  • ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో సంభవించిన భారీ పేలుడులో ఓ కార్యకర్త దుర్మరణం పాలయ్యాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కోల్ కతాకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పార్టీ కార్యాలయం ధ్వంసమైంది. ఈ పేలుడుకు క్రూడ్ బాంబ్ కానీ, గ్యాస్ సిలిండర్ పేలడం కానీ కారణమై ఉండవచ్చని ఆ సమయంలో అక్కడున్నవారు తెలిపారు. టీఎంసీ ఎమ్మెల్యే ప్రద్యుత్ ఘోష్ మాట్లాడుతూ, పేలుడుకు కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పారు.

More Telugu News