Andhra Pradesh: సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ కోడెల

  • పది రోజులు కొనసాగనున్న సమావేశాలు
  • ప్రత్యేక అంశాలను చర్చిస్తామన్న కోడెల
  • కేరళ కోలుకోవాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 6న ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఈ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రత్యేక అంశాలను చర్చించేలా ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వర్షకాల, శీతాకాల సమావేశాలను కలిపి నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఈ రోజు తిరుమలలో శ్రీవారిని కోడెల దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ వరదల నుంచి అక్కడి ప్రజలు వెంటనే కోలుకోవాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో రొటీన్ గా కాకుండా ప్రత్యేక అంశాలను చర్చించనున్నట్లు కోడెల పేర్కొన్నారు.

More Telugu News