Telangana: ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురి గొంతు కోసేసిన తండ్రి!: తెలంగాణలో పరువు హత్య

  • అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం
  • నాలుగేళ్ల క్రితం విజయ ప్రేమ వివాహం
  • ఆగ్రహంతో హత్యచేసిన తండ్రి

కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం తట్టుకోలేని ఓ తండ్రి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కుమార్తె గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా గొంతు కోసి చంపాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.

అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సీ కాలనీకి చెందిన విజయ వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఊరి నుంచి దూరంగా వెళ్లి బతుకుతున్నారు. ఇటీవల తన అత్త చనిపోవడంతో విజయ సొంత ఊరికి వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న విజయ కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. అయితే ఈ పెళ్లి వ్యవహారంతో ఊర్లో తన పరువు పోయిందని భావించిన తండ్రి విజయను కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు.

More Telugu News