kcr: టీ-మంత్రులతో కేసీఆర్ అత్యవసర సమావేశం

  • ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం ప్రారంభం
  • ముందస్తు ఎన్నికల అంశంపై చర్చ?
  • ఈ సమావేశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి 

తెలంగాణ మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

కాగా, విలేకరులతో వారం క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ‘అసెంబ్లీని రద్దు చేస్తే మా మంత్రులకే తెలియదు. మీకు చెప్తానా?’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు, ఈ సమావేశానికి ఏమైనా సంబంధం ఉందా? అనే విషయమై రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. 

More Telugu News