aadi pinishetty: ఆకట్టుకుంటోన్న 'నీవెవరో' ట్రైలర్

  • హరనాథ్ దర్శకత్వంలో 'నీవెవరో'
  • కామెడీకి పెద్ద పీట 
  • ఈ నెల 24వ తేదీన రిలీజ్  

ఆది పినిశెట్టి హీరోగా 'నీవెవరో' సినిమా రూపొందింది. హరనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి సరసన తాప్సీ .. రితికా సింగ్ కథానాయికలుగా నటించారు. ఎమ్ వీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను వదిలారు. చరణ్ చేతులమీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం అన్వేషిస్తోన్న యువకుడిగా ఆది పినిశెట్టి కనిపిస్తున్నాడు. కామెడీ పోలీస్ గా వెన్నెల కిషోర్ సందడి చేస్తున్నాడు. యాక్షన్ .. కామెడీ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను అందించారు. వెన్నెల కిషోర్ .. సప్తగిరి కామెడీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ట్రైలర్ ను బట్టి అనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆది పినిశెట్టికి ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి. 

More Telugu News