balineni srinivas reddy: వైసీపీ నేత బాలినేనికి తప్పిన పెను ప్రమాదం.. బైకర్ కు గాయాలు!

  • ప్రయాణిస్తుండగా పేలిపోయిన కారు టైర్
  • అదుపుతప్పి పక్కకు దూసుకుపోయిన కారు
  • అటుగా వెళ్తున్న ఓ బైకును ఢీకొన్న వాహనం

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం ఆయన తన కారులో ఒంగోలు నుంచి త్రోవగుంటకు వెళ్లే రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. త్రోవగుంటకు వచ్చేసరికి కారు టైరు పేలిపోయింది. దీంతో, అదుపు తప్పిన కారు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో అదే సమయంలో బైక్ పై అటుగా వెళుతున్న మార్నేని ఆంజనేయులు అనే వ్యక్తిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. బాలినేని మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ ఆంజనేయులును ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

More Telugu News