Cricket: ఇంగ్లండ్‌ భరతం పట్టిన భారత్‌ బౌలర్లు.. విజయానికి ఒక వికెట్‌ దూరంలో ఇండియా!

  •  రెండు ఓటముల తరువాత పరాజయానికి దీటైన బదులు
  •  రెండో ఇన్నింగ్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన బుమ్రా
  •  ఇంగ్లండ్‌ ఘోర పరాజయాన్ని అడ్డుకున్న బట్లర్‌, స్టోక్స్‌

తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఘోర పరాజయంతో విమర్శల పాలైన టీమిండియా మూడో టెస్ట్‌లో ఫుల్‌ బౌన్స్‌ తో చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో హార్డిక్‌ పాండ్యా ఆతిథ్య జట్టు నడ్డి విరవగా, రెండో  ఇన్నింగ్స్‌లో ఆ బాధ్యతను బుమ్రా తన భుజానికెత్తుకున్నాడు. 521 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఇంగ్లండ్‌, గంట తిరిగే సరికే నాలుగు వికెట్లు కోల్పోయింది. కుక్‌, రూట్‌లాంటి ప్రధాన బ్యాట్స్‌మన్‌లు ఔటైపోవడంతో తొలి రెండు సెషన్లలోపే ఆట ముగిసిపోతుందనుకున్నారు.

కానీ, బట్లర్‌, స్టోక్స్‌ జోడీ భారత్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు భారత బౌలర్లను ఓ ‘ఆట’ ఆడుకున్నారు. ఆపై బుమ్రా మ్యాజిక్ కొనసాగింది. టపటపా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను పతనం అంచుకు చేర్చాడు బుమ్రా. దీంతో నాలుగో రోజే భారత్‌ విజయంతో ఆట ముగిస్తుందని అభిమానులు ఆశించినా, 9 వికెట్లు మాత్రమే పడ్డాయి. విజయానికి భారత్ ఒక వికెట్‌ దూరంలో నిలువగా, నేటి ఆట మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు రషీద్‌, ఆండర్సన్‌ క్రీజ్‌లో ఉండగా, ఇంగ్లండ్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు.

చివరి రోజు భారత్‌ విజయం లాంఛనమే అయినా, భారత బౌలర్లను వీరిద్దరూ ఎంతసేపు అడ్డుకుంటారనేది ఆసక్తిదాయకం.

సంక్షిప్తంగా స్కోర్లు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌-329
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌-161
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌-352/7
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌-311/9

More Telugu News