Congress: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ మృతి

  • ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూత
  • ధ్రువీకరించిన పార్టీ వర్గాలు
  • ముంబై పార్టీ అధ్యక్షుడిగానూ సేవలు

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ (63) కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని పార్టీ ధ్రువీకరించింది. గురుదాస్ గతంలో ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. గురుదాస్ మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News