dhanush: వరుసగా మూడు భారీ చిత్రాలు చేయనున్న ధనుష్

  • త్వరలో రిలీజ్ కానున్న 'వడ చెన్నై'
  • సెట్స్ పై వున్న 'మారి 2'
  • కలైపులి థాను నిర్మాతగా భారీ సినిమాలు   

తమిళ స్టార్ హీరోల జాబితాలో ధనుష్ కూడా కనిపిస్తాడు. కొత్తదనానికీ .. సహజత్వానికి ప్రాముఖ్యతనిస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఈ  కారణంగానే అక్కడ ఆయనకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆయన చేతిలో 'వడ చెన్నై' .. 'మారి 2' సినిమాలు వున్నాయి. వెట్రి మారన్ దర్శకత్వం వహించిన 'వడ చెన్నై' .. వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకి సీక్వెల్ ను కార్తీక్ సుబ్బరాజుతో ప్లాన్ చేస్తోన్న ధనుష్, కలైపులి థాను నిర్మాణంలో వరుసగా మూడు సినిమాలు చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ మూడు సినిమాలను స్టార్ డైరెక్టర్లే చేస్తారట. తమిళంతో పాటు తెలుగులోను మంచి క్రేజ్ వున్న కథానాయికలను ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.  

More Telugu News