7 governers: ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం.. కేంద్రం ఉత్తర్వులు

  • ఉత్తరాఖండ్ గవర్నర్ గా బేబీ రాణి మౌర్య
  • హరియాణా గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య
  • బీహార్ గవర్నర్ గా లాల్ జీ టాండన్

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి వివరాలు.. ఉత్తరాఖండ్ గవర్నర్ గా బేబీ రాణి మౌర్య, హరియాణా గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, బీహార్ గవర్నర్ గా లాల్ జీ టాండన్ ని నియమించారు. కాగా, ఇంత వరకూ బీహార్ గవర్నర్ గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ ను జమ్ముకశ్మీర్ గవర్నర్ గా నియమించారు. అదేవిధంగా, ప్రస్తుత మేఘాలయ గవర్నర్ రంగాప్రసాద్ ను సిక్కింకు, మేఘాలయకు కొత్త గవర్నర్ గా తథాగత రాయ్ ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News