sensex: నేడు మార్కెట్ల లాభాలు స్వల్పమే.. కానీ సరికొత్త రికార్డులు!

  • జీవనకాల గరిష్ఠ స్థాయులను తాకిన మార్కెట్లు
  • 38,286కు పెరిగిన సెన్సెక్స్
  • 19 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలను నమోదు చేసినప్పటికీ... కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ రోజంతా లాభనష్టాల్లో ఊగిసలాడినప్పటికీ, చివరకు లాభాల్లో ముగిశాయి. తద్వారా జీవనకాల గరిష్ఠ స్థాయులను తాకాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 38,286కు పెరిగింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 11,571 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కజారియా సిరామిక్స్ (10.53%), కేఆర్ఎల్బీ లిమిటెడ్ (8.89%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (7.31%), సీఈఎస్సీ లిమిటెడ్ (7.01%), కమిన్స్ ఇండియా (6.70%).

టాప్ లూజర్స్:
హెచ్డీఐఎల్ (-4.85%), అమరరాజా బ్యాటరీస్ (-3.05%), జెట్ ఎయిర్ వేస్ (-2.94%), ఇండియా బుల్స్ రియలెస్టేట్ (-2.92%), డీఎల్ఎఫ్ (-2.91%).  

More Telugu News