Buttarenuka: కేరళకు ఎంపీ కోటా నుండి 5 లక్షల సాయం అందజేసిన బుట్టా రేణుక

  • కర్నూలు ఎంపీ వితరణ 
  • ఎంపీ లాడ్స్ నుంచి రూ. 5 లక్షల ఆర్ధిక సాయం 
  •  కేరళకు అండగా వుండాలని పిలుపు

కేరళ వరద బాధితుల సహాయార్థం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రూ. 5 లక్షల విరాళాన్ని అందించారు. ఎంపీ లాడ్స్ నుంచి ఈ విరాళాన్నిఆమె ప్రకటించారు. వర్షాలు, వరదల కారణంగా కేరళలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పి తన వంతు సహాయంగా ఎంపీ లాడ్స్ నుండి రూ. 5 లక్షల విరాళం పంపినట్టు తెలిపారు. ఎర్నాకులం జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పిన బుట్టా రేణుక అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ ను కలిసి స్వయంగా రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. 

More Telugu News