Chandrababu: ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయగల నేత చంద్రబాబు: గల్లా జయదేవ్

  • మా తాత, అమ్మ నాడు ‘కాంగ్రెస్’ పార్టీలో ఉన్నవారే 
  • హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారు
  • అందుకే, మా అమ్మ ‘కాంగ్రెస్’ ను వీడింది

ఏపీ సీఎం చంద్రబాబుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశంసలు కురిపించారు. నాడు కాంగ్రెస్ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ఆయన గుర్తుచేసుకున్నారు. అమరావతిలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం రాకముందు నుంచి తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, తమ తాత, అమ్మ నాడు ‘కాంగ్రెస్’ పార్టీలో ఉన్నవారేనని అన్నారు. అయితే, హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన చేయడంతో ఆవేదన చెందిన తన తల్లి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని అన్నారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేయగల నేత చంద్రబాబు అని, అందుకే, తమ కుటుంబం టీడీపీలో చేరిందని అన్నారు.

More Telugu News