parashuram: నా మొహమాటమే నా కొంపముంచేసింది: 'గీత గోవిందం' దర్శకుడు

  • 'ఆంజనేయులు'సమయంలో పొరపాట్లు జరిగాయి 
  • 'సోలో' సినిమాకి కొన్ని విషయాలు తెలుసుకున్నాను 
  • నా చుట్టూ వుండి పొగిడినవాళ్లు దూరంగా వెళ్లిపోయారు

సినీ రచయితగా .. దర్శకుడిగా పరశురామ్ కి మంచి అనుభవముంది. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను 'ఆంజనేయులు' సినిమా చేశాను .. నాకున్న స్పీడ్ కి నేను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయా. నేను కాస్త దృష్టి పెడితే సినిమాలోని కొన్ని అంశాలను చాలా బాగా హ్యాండిల్ చేయగలననే విషయం కూడా ఆ సమయానికి నాకు తెలియదు.

'సోలో' సినిమా చేసే సమయానికి కొన్ని విషయాలను తెలుసుకున్నాను. ఆ తరువాత నా డ్రీమ్ ప్రాజెక్టుగా 'సారొచ్చారు' చేశాను. కొంతమంది కారణంగా కథలో మార్పులు చేయడం వలన అనుకున్న విధంగా చేయలేకపోయాను. కరెక్టుగా చెప్పాలంటే మొహమాటానికి పోయాను .. ఆ మొహమాటమే నా కొంపముంచింది. అప్పటి వరకూ నా చుట్టూ వుండి 'నువ్ సూపర్ రా' అంటూ పొగిడిన వాళ్లంతా నా మనసు గాయపరిచి మరీ దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో నాకు అండగా నిలబడింది నా భార్య మాత్రమే" అని చెప్పుకొచ్చారు.     

More Telugu News