vijay devarakonda: 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'గీత గోవిందం'

  • తొలి రోజున 16.40 కోట్ల గ్రాస్ 
  • 5 రోజుల్లో 55 కోట్ల గ్రాస్ 
  • ఫుల్ రన్లో కొత్త రికార్డు నమోదు చేసే ఛాన్స్

ఈ మధ్య కాలంలో యూత్ ను విపరీతంగా .. విశేషంగా ఆకట్టుకున్న చిత్రంగా 'గీత గోవిందం' కనిపిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజునే 16.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తన జోరు చూపిస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను .. 31కోట్ల షేర్ ను సాధించింది.  చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం పట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. యూత్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉండటం వల్లనే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News