parashuram: పూరి జగన్నాథ్ ని చూసే దర్శకుడిని కావాలనుకున్నాను: 'గీత గోవిందం' దర్శకుడు

  • నలుగురు దర్శకుల దగ్గర పనిచేశాను 
  • వాళ్లంతా మంచి ప్రతిభ కలిగినవారు 
  • ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నాను      

పరశురామ్ దర్శకత్వం వహించిన 'గీత గోవిందం' తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాల్లోను ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "నేను పూరిగారి దగ్గర 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' .. 'ఆంధ్రావాలా' సినిమాలకి పనిచేశాను. ఆ తరువాత దశరథ్ .. వీరూ పోట్ల .. 'బొమ్మరిల్లు' భాస్కర్ దగ్గర పనిచేశాను.

ఈ నలుగురు కూడా మంచి ప్రతిభ కలిగిన రచయితలు .. దర్శకులు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకున్నాను. పూరిగారిని చూసే .. నేను డైరెక్టర్ ని కావాలని అనుకున్నాను. నా కళ్ల ముందు తిరిగిన పూరిగారిని స్టార్ డైరెక్టర్ గా చూసి ఆశ్చర్యపోయాను. ఏదైనా ఒకటి అనుకుంటే అది తప్పకుండా చేసి తీరాలనే విషయాన్ని ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను. రైటింగ్ సైడ్ నాకు బాగా హెల్ప్ అయింది వీరూ గారి దగ్గర. స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలనేది ఆయన దగ్గరే నాకు బాగా తెలిసింది" అని చెప్పుకొచ్చారు.      

More Telugu News