vijay devarakonda: తమిళనాట దూసుకుపోతోన్న 'గీత గోవిందం'

  • తెలుగు రాష్ట్రాల్లో దూకుడు 
  • ఓవర్సీస్ లోను అదే జోరు 
  • తమిళనాడులోనూ గట్టిపోటీ  

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా 'గీత గోవిందం' చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఇక తమిళనాడులోను ఈ సినిమా వసూళ్ల పరంగా తన సత్తా చాటుతోంది.

ఈ ఏడాది తమిళనాడులో ఇంతవరకూ వచ్చిన సినిమాలలో 'కడై కుట్టి సింగం' అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఆ స్థానానికి 'గీత గోవిందం' గట్టిపోటీని ఇస్తోంది. తమిళనాడులో 'బాహుబలి' తెలుగు వెర్షన్ భారీ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్లో 'గీత గోవిందం' ఆ వసూళ్లను క్రాస్ చేయడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ కావడమే ఈ స్థాయి వసూళ్లకు కారణమని చెప్పుకుంటున్నారు.    

More Telugu News