Yamuna River: వాజ్ పేయి చితాభస్మాన్ని సేకరించిన నమిత, నిహారిక!

  • యమునా తీరానికి వచ్చిన వాజ్ పేయి దత్తపుత్రిక
  • కూతురితో కలసి చితాభస్మ సేకరణ
  • పుణ్యనదుల్లో నిమజ్జనం చేయనున్న కుటుంబీకులు

దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు జరిగిన యమునా తీరంలోని స్మృతి స్థల్ నుంచి ఆయన చితాభస్మాన్ని దత్త కుమార్తె నమిత, ఆమె కూతురు నిహారిక ఈ ఉదయం సేకరించారు. అంత్యక్రియలు జరిగిన మూడో రోజున సంచయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతం నుంచి చితాభస్మాన్ని సేకరించి మూడు కుండల్లో ఉంచారు నమిత, నీహారిక. వీటిని ప్రేమ్ ఆశ్రమ్ కు తరలిస్తామని, ఆ తరువాత ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని వాజ్ పేయి బంధువులు తెలిపారు. పవిత్ర నదుల్లో చితాభస్మం నిమజ్జనం చేసే కార్యక్రమానికి హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారని తెలుస్తోంది.

More Telugu News