Kerala: కేరళలో ప్రకృతి బీభత్సం హృదయాన్ని కలిచివేస్తోంది: వైఎస్ జగన్

  • నా ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజలతోనే ఉంటాయి
  • కేరళ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి
  • కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి

కేరళలో ప్రకృతి బీభత్సం తన హృదయాన్ని కలిచివేస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు, ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటే ఉంటాయని అన్నారు. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన కేరళ ప్రజలకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరుతూ జగన్ ఓ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, కేరళ విపత్తులో ఇప్పటివరకు 324 మంది మృతి చెందారు. 3 లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు.1300 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

More Telugu News