vaj payee: వాజ్ పేయి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల మంత్రులు

  • పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మంత్రులు హాజరు
  • భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్ కూడా
  • వాజ్ పేయి మృతిపై ప్రపంచ దేశాల నేతల దిగ్భ్రాంతి

మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల మంత్రులు తరలివచ్చారు. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మంత్రులు, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్ ఇప్పటికే చేరుకున్నారు. కాగా, వాజ్ పేయి మృతిపై ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. భారత్-అమెరికా సంబంధాలు మెరుగుపరచడంతో వాజ్ పేయి కీలకపాత్ర పోషించారని అమెరికా దౌత్య కార్యాలయం ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత రాజకీయాల్లో వాజ్ పేయి పేరు ఓ అంతర్భాగమైందని, ప్రపంచం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని రష్యా పేర్కొంది.

More Telugu News