sudheer babu: సుధీర్ బాబు .. మెహ్రీన్ ల న్యూ మూవీ లాంచ్

  • పులి వాసు దర్శకుడిగా తాజా చిత్రం 
  • రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు 
  • సుధీర్ బాబు జోడీగా మెహ్రీన్  

వైవిధ్యభరితమైన కథాకథనాలకు ప్రాధాన్యతనిస్తూ, సుధీర్ బాబు ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ మధ్య ఆయన చేసిన 'సమ్మోహనం' సినిమా భారీ విజయాన్ని సాధించింది. త్వరలోనే ఆయన 'నన్నుదోచుకుందువటే' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరో దర్శకుడు పులి వాసుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ కాంబినేషన్లోని సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. ప్రముఖ దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా .. దిల్ రాజు క్లాప్ ఇవ్వగా .. ముహూర్తపు సన్నివేశానికి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ .. పోసాని కృష్ణ మురళి .. సీనియర్ నరేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. 

More Telugu News