vijay devarakonda: కేరళ వరద బాధితులకు విరాళం ప్రకటించిన 'గీత గోవిందం' నిర్మాత

  • కేరళను అస్తవ్యస్తం చేసిన వర్షాలు
  • నిరాశ్రయులుగా మిగిలిన ఎంతోమంది ప్రజలు
  • వరద బాధితులకు సినీపరిశ్రమ నుంచి సాయం

విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా రూపొందిన 'గీత గోవిందం' సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా కేరళలోను భారీస్థాయిలో విడుదలైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కేరళ ప్రాంతమంతా అస్తవ్యస్తమైపోయింది. ఈ వర్షాల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.

దాంతో కేరళ వాసులను ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించడానికిగాను ఎవరికి తోచిన సాయం వాళ్లు చేస్తున్నారు. సినిమా పరిశ్రమకి సంబంధించిన చాలామంది పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'గీత గోవిందం' నిర్మాత బన్నీవాసు కూడా వరద బాధితులకు విరాళం ప్రకటించాడు. కేరళలో 'గీత గోవిందం' ఎంత షేర్ ను రాబడుతుందో అంతమొత్తాన్ని ఆయన విరాళంగా అందజేయనున్నట్టు చెప్పారు.  

More Telugu News