vajpayee: వాజ్ పేయికి సంబంధించి ఎయిమ్స్ వైద్యుల నివేదిక ఇదే!

  • జూన్ 11న ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు
  • గత 36 గంటలుగా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది
  • ఎంతో ప్రయత్నించాం.. చివరకు కాపాడుకోలేక పోయాం

మాజీ ప్రధాని వాజ్ పేయి ఇకలేరు అంటూ ఎయిమ్స్ వైద్యులు ప్రెస్ రిలీజ్ ను విడుదల చేశారు. ఎయిమ్స్ కు చెందిన మీడియా మరియు ప్రొటోకాల్ డివిజన్ ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ప్రెస్ రిలీజ్ లోని సారాంశం ఇదే.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తుదిశ్వాస విడిచారనే విషయాన్ని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 11న ఆయన ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో గత 9 వారాలుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే వుంది. అయితే ఊహించని విధంగా గత 36 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను వెంటిలేటర్ పై ఉంచాం. ఆయన ప్రాణాలను కాపాడటానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ... చివరకు ఆయనను దక్కించుకోలేక పోయాం.

More Telugu News