Telangana: ‘తెలంగాణ’ ఇచ్చినందుకు కాంగ్రెసోళ్లు లుచ్చాలా?: కేటీఆర్ పై భట్టి విక్రమార్క ఆగ్రహం

  • ‘కాంగ్రెస్’ నేతలు లుచ్చాలన్న కేటీఆర్ 
  • ప్రాజెక్టులు కట్టినందుకు కాంగ్రెస్సోళ్లు లుచ్చాలా?
  • కేటీఆర్ కు సంస్కారం ఉందనుకున్నానాన్న భట్టి 

కాంగ్రెస్ పార్టీ నేతలు లుచ్చాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ- కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్సోళ్లు లుచ్చాలా? ప్రాజెక్టులు కట్టినందుకు కాంగ్రెస్సోళ్లు లుచ్చాలా? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినందుకు కాంగ్రెస్సోళ్లు లుచ్చాలా? ‘ఇందిరమ్మ’ ఇళ్లు కట్టించింనందుకు కాంగ్రెస్సోళ్లు లుచ్చాలా? ..ఏ విషయంలో తమ పార్టీ నేతలు లుచ్చాగాళ్లో కేటీఆర్ చెప్పాలంటూ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఇంగ్లీషు స్కూల్లో చదివి, అమెరికాలో పని చేసిన కేటీఆర్ కు సంస్కారం ఉందనుకున్నాను కానీ, తన స్థాయి మర్చిపోయి మాట్లాడిన కేటీఆర్ నాగరికుడో, అనాగరికుడో అర్థం కావట్లేదని విమర్శించారు.

More Telugu News