vajpayee: ఆయన మళ్లీ మనముందుకొచ్చి మాట్లాడితే చూడాలని ఉంది: కన్నీటి పర్యంతమైన వాజ్ పేయి మేనకోడలు

  • నిన్న మా అబ్బాయి ఎయిమ్స్ కు వెళ్లాడు
  • వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు చెప్పాడు
  • వాజ్ పేయి మన ముందుకొస్తే బాగుంటుంది
  • అలాంటి అవకాశమివ్వమని దేవుడిని కోరుతున్నా  

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సహా పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయిని పరామర్శించారు. కాగా, వాజ్ పేయి ఆరోగ్యం విషమించడంపై ఆయన మేనకోడలు కాంతి మిశ్రా కన్నీరు మున్నీరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, నిన్న తన కుమారుడు ఎయిమ్స్ కు వెళ్లి రోజంతా అక్కడే ఉన్నాడని, వెంటిలేటర్ పై వాజ్ పేయికి చికిత్స అందిస్తున్నట్టు తన కుమారుడు తనకు చెప్పాడని అన్నారు. వాజ్ పేయి మళ్లీ మన ముందుకొచ్చి మాట్లాడితే చూడాలని ఉందని, ఒక్కసారి అలాంటి అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ఆమె కన్నీరు పెట్టారు.  

More Telugu News