modi: ఎంతో ఆవేదనతో ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మోదీ

  • 40 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న మోదీ
  • విషణ్ణ వదనంతో వెళ్లిపోయిన ప్రధాని
  • కాసేపట్లో వాజ్ పేయి హెల్త్ బులెటిన్ విడుదల 

మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ప్రధాని మోదీ, ఈరోజు మళ్లీ కాసేపటి క్రితం ఆసుపత్రికి వచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మోదీ ముఖం ఎంతో ఆవేదనాభరితంగా కనిపించింది. మోదీ వెళ్లి పోయిన నేపథ్యంలో, కాసేపట్లో ఎయిమ్స్ వైద్యులు అత్యంత కీలకమైన వాజపేయి హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు. ఈ బులెటిన్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. 

More Telugu News