rasi kahanna: ప్చ్.. 'గీత గోవిందం' మిస్ అయిన రాశి ఖన్నా!

  • ముందుగా రాశిఖన్నాను అడిగిన టీమ్ 
  • పారితోషికం భారీగా అడిగిన రాశిఖన్నా 
  • రష్మిక మందనకి వెళ్లిన ఛాన్స్

 హీరోహీరోయిన్లలో ముందుగా కొంతమందికి వచ్చిన అవకాశాలు .. కొన్ని కారణాల వలన మరొకరికి వెళుతూ ఉంటాయి. అలా ఇతరులకి వెళ్లిన సినిమాలు సక్సెస్ అయినప్పుడు .. ఆ పాత్ర అవతలివారికి మంచి క్రేజ్ తెచ్చినప్పుడు.. అది మిస్ అయిన వాళ్లు ఫీల్ కావడం సహజమే. ప్రస్తుతం రాశి ఖన్నా అలాగే ఫీల్ అవుతోందని అంటున్నారు.

'గీత గోవిందం' సినిమాకి ముందుగా లావణ్య త్రిపాఠిని అనుకున్నారట. కానీ రాశిఖన్నా అయితే కరెక్టుగా ఉంటుందని భావించి ఆమెను సంప్రదించారు. పారితోషికంగా కోటి రూపాయలు ఇస్తే చేయడానికి తాను సిద్ధమేనని చెప్పిందట. కాస్త తగ్గించుకోమంటూ చెప్పినా ప్రయోజనం లేకుండా పోవడంతో, రష్మిక మందనను తీసుకున్నారు. ఒక వైపున ఎంతో ఆశపడి చేసిన 'శ్రీనివాస కళ్యాణం' ఆశించిన స్థాయిలో క్రేజ్ తీసుకురాకపోవడం .. మరో వైపున తాను లైట్ తీసుకున్న 'గీత గోవిందం' దూసుకుపోతుండటంతో పాపం రాశి ఖన్నా బాగానే ఫీల్ అవుతోందట.   

More Telugu News