Chandrababu: సెల్ఫీ దిగుతున్న చంద్రబాబునాయుడు... ఫొటోలు చూడండి!

  • నిన్న ప్రకాశం బ్యారేజి వద్ద 'అమరావతి సెల్ఫీ పాయింట్' ప్రారంభం
  • ఈ ఉదయం ఫొటోలను పోస్టు చేసిన చంద్రబాబునాయుడు
  • ఈ ప్రాంతానికి మరింత అందం వచ్చిందని వ్యాఖ్య

నిన్న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద 'అమరావతి సెల్ఫీ పాయింట్'ను ప్రారంభించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, అక్కడ తాను దిగిన సెల్ఫీలను ఈ ఉదయం 8 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో పంచుకున్నారు. విజయవాడ నగరానికే తలమానికమైన ప్రకాశం బ్యారేజి వద్ద 'అమరావతి సెల్ఫీ పాయింట్‌'ను ప్రారంభించడంతో, ఈ ప్రాంతానికి మరింత అందం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో బ్యారేజి వద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుస్తామని తెలిపారు. చంద్రబాబు సెల్ఫీ దిగుతున్న దృశ్యాలను మీరూ చూడవచ్చు.

More Telugu News